మొహమాటానికి పోయి.. గోపీచంద్ ఒప్పుకున్న ఫ్లాప్ సినిమాలు ఇవే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ గోపీచంద్ మాత్రం మ్యాచో స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా కూడా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించి తన నటనతో అందరి హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తొలివలపు అని సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

 ఇక తర్వాత కాలంలో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో ఇక పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన గోపీచంద్ తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి వరుసగా రెండు మూడు సినిమాల్లో విలన్ పాత్రల్లోనే కనిపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని మళ్ళీ హీరోగా ప్రస్తానాన్ని మొదలు పెట్టాడు గోపీచంద్. యజ్ఞం సినిమాతో హీరోగా యూటర్న్ తీసుకొని ఇక సూపర్ హిట్ కొట్టాడు. ఇక తన యాక్షన్ తో అటు ప్రేక్షకులందరిలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో హీరోలు అందరూ కూడా కథల విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉంటారు. ఇక కథ నచ్చలేదు ఫ్లాప్ అవుతుంది అనిపిస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంటారు.

 కానీ గోపీచంద్ మాత్రం మొహమాటానికి పోయి సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన కొన్ని సినిమాలను చేసాడట. అలాంటి వాటిలో ఉదయ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన రారాజు సినిమా కూడా ఒకటి. సినిమా షూటింగ్ సమయంలోనే ఫ్లాప్ అవుతుందని గోపీచంద్ కు అర్థమైందట. కానీ మొహమాటానికి పోయి ఇచ్చిన మాట కోసం సినిమా పూర్తి చేశాడట. వి రమణ దర్శకత్వంలో వచ్చిన ఒంటరి సినిమా విషయంలో కూడా గోపీచంద్ మోహమాటమే చివరికి అతని దెబ్బతీసింది. ఇలా కెరియర్ తొలినాళ్లలో జరిగిన కొన్ని ఎదురుదెబ్బల వల్లే మొహమాటానికి పోయి సినిమాలు చేయకూడదని గ్రహించాడట గోపీచంద్. ఇక ఇప్పుడు సినిమా కథల విషయంలో జాగ్రత్త పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: