పదేళ్ల గ్యాప్ తర్వాత.. మెగాస్టార్ 'విశ్వంభర'తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్?
అయితే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది అని ఇటీవల చిత్ర బంధం కూడా అధికారికంగా ప్రకటించింది. కాగా త్రిష కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇక ఈ మూవీలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది మెయిన్ హీరోయిన్ పాత్ర కాకుండా ఇక విశ్వంబర మూవీలో మరో రెండు కీలకమైన పాత్రలు ఉంటాయట. ఇక ఈ పాత్రల కోసం ఇద్దరూ హీరోయిన్స్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ తో ఇక వీరికి కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. గతంలో ఇషా చావ్లా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రేమ కావాలి, పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
ఇక ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు లేక చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత ఇషా చావ్లా విశ్వంభరా సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇక బీరువా ఎక్స్ప్రెస్ రాజా లాంటి హిట్ సినిమాలతో మెప్పించిన సురభి.. ఇక ఆ తర్వాత అడప దడపా అవకాశాలను మాత్రమే అందుకుంది. 2019లో చివరిసారిగా శశి అనే సినిమాలో నటించింది ఇక ఇప్పుడు విశ్వంబర సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి.