హనుమాన్ సీక్వెల్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన అన్ని పెద్ద సినిమాలను దాటి హనుమాన్ సినిమా తన విశ్వరూపం ఏంటో చూపించింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిన్న సినిమా 330 కోట్ల ఒక పైగా రాబట్టింది. కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు ఆల్ టైం రికార్డ్ కూడా సృష్టించింది. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించాడు దర్శకుడు. హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా జై హనుమాన్ సినిమా 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే 2025లో జై హనుమాన్ రావడం కష్టమే అని తెలుస్తోంది. జై హనుమాన్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ ఇప్పటికే కమిటైన అధీర, మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం పూర్తి చేసి జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించాలి.

 దాంతో జై హనుమాన్ ను 2025 రిలీజ్ అని ప్లాన్ చేసినా సినిమా రిలీజ్ కన్నా పెరిగిన అంచనాలను అందుకునేలా తీయడం ముఖ్యం అని భావిస్తోంది చిత్ర యూనిట్. అంతేకాదు హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో జై హనుమాన్ ని కావాల్సినంత బడ్జెట్ లో తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తేజ సజ్జా రీసెంట్ గా జరిగిన మీడియా ఇంట్రాక్షన్ లో క్లారిటీ ఇచ్చారు. జై హనుమాన్ చిత్రం కు లేటు అవుతుందని, ఈ లోగా తాను ఈ గ్యాప్ లో చాలా సినిమాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే 2025 లో సాధ్యం కాకపోవచ్చు అని, లార్జ్ స్కేల్ మూవీ కావటంతో టైమ్ పడుతుందని అన్నారు. 2026లోనే సినిమా రిలీజ్ ఉండవచ్చు అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: