రాకేష్ మాస్టర్ ఇప్పుడు బ్రతికుండి ఉంటేనా.. కెరియర్ మారిపోయేది?

praveen
సాధారణంగా ఒక మనిషి చనిపోతే కుటుంబ సభ్యులైనా సరే కొన్నాళ్లపాటు ఏడ్చి అతన్ని మరిచిపోతూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండేది ఎవరు అంటే కేవలం సినిమా నటులు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా ఇక ఆయా నటులు నటించిన సినిమాలు వారు పోషించిన పాత్రలు ఎప్పుడు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోకుండా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆయన నటులను ఎప్పుడూ తెరమీద చూసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇలా ఎంతోమంది నటులు భౌతికంగా లేకపోయినప్పటికీ సినిమాలతో మాత్రం జీవించి ఉండేవారు.

 అయితే ఒక నటుడుని గుర్తుంచుకోవడానికి 100 సినిమాలు చేయనవసరం లేదు ఇక ప్రేక్షకులకు చేరువయ్యే ఒకే ఒక్క సినిమా చేసిన చాలు. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా రాకేష్ మాస్టర్ ను ఇలాగే గుర్తుంచుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలు పెట్టిన రాకేష్ మాస్టర్ ఒకప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా హవా నడిపించారు.. ఇక ఆ తర్వాత డాన్స్ షోలకు జడ్జిగా కూడా చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాకేష్ మాస్టర్ కెరియర్ పూర్తిగా నాశనమైంది.

 ఇక యూట్యూబ్లో పలు ఇంటర్వ్యూలలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాకేష్ మాస్టర్ వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ మారిపోయాడు. అయితే ఇటీవల అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు ఆయన. కానీ ఇప్పుడు ఆయనకు ఊహించని రీతిలో గుర్తింపు వచ్చింది. ఇటీవల సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమాలో రాకేష్ మాస్టర్ ఒక కీలక పాత్ర పోషించాడు. ఊరి పెద్ద గజేంద్రకి చెంచాగా పులి రాజు పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాలో కనిపించింది కొన్ని సీన్స్ లో అయినా తన నటనతో మెప్పించాడు రాకేష్ మాస్టర్. ఒకవేళ రాకేష్ మాస్టర్ ఇప్పుడు బ్రతికి ఉండి ఉంటే మాత్రం హనుమాన్ తర్వాత ఆయన లైఫ్ మరోలా మారిపోయేది అని ఆయన అభిమానులు అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: