మా అమ్మ నన్ను తెలుగులో తిట్టేది.. శ్రీదేవి కూతురు కామెంట్స్ వైరల్?

praveen
ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే ఒక భాషను మించి రెండు మూడు భాషల్లో ఒక హీరో సినిమాను విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు అంటే చాలు అతన్ని పాన్ ఇండియా హీరో అని పిలవడం మొదలు పెడుతున్నారు. కానీ ఒకప్పుడు పాన్ ఇండియా పదం లేదు కానీ.. ఉండి ఉంటే మాత్రం ఎవరికి సాధ్యం కాని రీతిలో పాన్ ఇండియా హీరోయిన్గా చక్రం తిప్పేది దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 ఒకప్పుడు తెలుగు హీరోలు తెలుగుకి హిందీ హీరోలు హిందీకి పరిమితమైన సమయంలో శ్రీదేవి మాత్రం అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఇక అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఆమె భౌతికంగా ప్రేక్షకులకు దూరమైనప్పటికీ ఆమె చేసిన సినిమాల ద్వారా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ అభిమానులకు దగ్గరగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే హిందీలో పలు సినిమాలలో నటించగా తెలుగులో దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది జాన్వి. తన తల్లి శ్రీదేవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

 ఎన్నోసార్లు తన తల్లి శ్రీదేవి తనను తెలుగులో తిట్టేది అంటూ గుర్తు చేసుకుంది జాన్వీకపూర్. ఈ క్రమంలోనే జాన్వికపూర్ మాట్లాడుతూ అమ్మ ప్రతిసారి ఆ మాట నాతో అనేది. నేను ఆమె గదిలోకి వెళ్లి ఆమె లిప్ స్టిక్స్ దొంగలించేదాన్ని. నా పాకెట్స్ అన్ని కూడా లిప్ స్టిక్స్  పెట్టుకుని ఫుల్ అయ్యేవి. ఇక అప్పుడు అమ్మ నా దగ్గరికి వచ్చి నీ జేబులు చూపించు అని అడిగేది. నో అమ్మ అనే నేను అనేదాన్ని. అప్పుడు ఆమె నా కొడకా అని తిట్టేది అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇక జాన్వి మాటలు విన్న తెలుగు  ఫ్యాన్స్ అందరూ కూడా ఎమోషనల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: