అక్క కోసం అలాంటి పని చేస్తున్న కీర్తి సురేష్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.. గత కొద్ది రోజుల క్రితం నుంచి కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా ఈ ముద్దుగుమ్మ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు..


ఈ సినిమా వెబ్ సిరీస్ అక్క అనే కథ తో తెరకెక్కిస్తున్నారు. కథ కూడా బాగా నచ్చడంతో కీర్తి సురేష్ ఈ ప్రాజెక్టుకి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి చిత్రీకరణ కూడా ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ముంబైలో అక్క అనే వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో పాల్గొనేందుకు కీర్తి సురేష్ ముంబైకి చేరుకున్నట్టుగా సమాచారం. రాధిక ఆప్టే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తున్నది.



ఈ సిరీస్లో కీర్తి సురేష్ ను గతంలో ఎప్పుడు చూడని విధంగా యాక్షన్స్ సన్నివేశాలలో చూడబోతున్నామని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగానే అక్క అనే వెబ్ సిరీస్ ఉంటుంది అంటూ తెలుపుతున్నారు. రాధిక ఆప్టే, కీర్తి సురేష్ మధ్య సాగేటువంటి యాక్షన్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయట. ఇద్దరు హీరోయిన్స్ మధ్య పోరాట సన్నివేశాలు కచ్చితంగా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఈ సినిమాకి ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా చిత్ర బృందం ఎలాంటి విషయాన్ని క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ఏడాది దసరా సినిమాతో విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్.. భోళా శంకర సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: