వామ్మో: సెప్టెంబర్ నెలలో ఒకేసారి ఇన్ని చిత్రాలా..!!

Divya
సినీ పరిశ్రమకి మరొకసారి కాస్త ఊరట కలుగుతోందని చెప్పవచ్చు.  ఆగస్టు నెల లో విడుదలైన చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టుకుంది.విడుదలైన ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక రాబోయే సినిమాల పట్ల కాస్త భరోసా కల్పించారని చెప్పవచ్చు.  భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న ప్రతి చిన్న సినిమాను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన బింబిసారా, కార్తికేయ-2, సీతారామం వంటి చిత్రాలు ప్రేక్షకులను ఏకంగా థియేటర్లకు రప్పించేలా చేశాయి.

ఇక ఇప్పుడు టాలీవుడ్ చిత్ర నిర్మాతలు సైతం సెప్టెంబర్ నెలలో రాబోయే సినిమాల పైన బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నది. ఇక  సెప్టెంబర్ నెలలో ఒకేసారి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అందులో ముఖ్యంగా సెప్టెంబర్-2 వ తేదీన మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమా విడుదల కాబోతోంది. ఇక సెప్టెంబర్-9 న తేదీన తమన్నా సత్యదేవ్ కాంబినేషన్లో వస్తున్న గుర్తుందా  శీతాకాలం చిత్రం విడుదల కాబోతోంది. అలాగే హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం చిత్రం కూడా విడుదల కాబోతున్నాయి.

ఇక వీటితో పాటు యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని, నిఖిల్ అనుపమ జంటగా నటించిన 18 పేజీస్ , రెజీనా నటించిన షాకిని డాకిని, ఇక కృతి శెట్టి,  సుధీర్ బాబు కలిసి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలాంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ నెల అంతా సినీ ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందని చెప్పవచ్చు. మరి ఇందులో ఏ చిత్రాలు సక్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: