రానా పాడిన విప్లవ గీతం వీడియో వైరల్..!!
మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే అంటూ వచ్చే విప్లవ గీతం పాటని హీరో రానా పాడడం జరిగింది. ఆడబిడ్డ రక్షణ పై పోరాటం ,దళితుడి ఆత్మగౌరవాన్ని పై పోరాటం.. పేదోడు అన్నానీకై పోరాటం ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు వచ్చే చరణాలు అంటూ ఈ పాట ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఈ పాటని జిలకర శ్రీనివాస్ రాయగా.. సురేష్ బొబ్బిలి రానా కలిసి ఈ పాట ని పడడం జరిగింది. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నక్సలైట్ రవన్న గా హీరో రానా కనిపించబోతున్నారు. ఇందులో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాలోని కీలకమైన పాత్రలో నవీన్చంద్ర కూడా నటించడం గమనార్హం.
భారీ అంచనాల మధ్యన విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఇందులో రానా స్కోప్ తక్కువగా ఉన్నా కూడా ఈ సినిమాని కేవలం సాయిపల్లవి కోసమే తెరకెక్కించానని చెప్పడం గమనార్హం. ఇక అంతే కాకుండా ఈ సినిమాకి ఎక్కువగా సాయి పల్లవి పేరు వినిపిస్తూనే ఉన్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.