ట్రైలర్: అదుర్స్ అంటున్న విరాట పర్వం ట్రైలర్..!!

Divya
దగ్గుబాటి రానా నటిస్తున్న.. తాజా చిత్రం విరాట పర్వం. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఇక "నీది నాది ఒకే కథ"చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఈ చిత్ర డైరెక్టర్.. ఇక ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేసుకొని చిత్రం విడుదల సమయం మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం చేత పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం జూన్ 17న విడుదలకు సిద్ధంగా ఉన్నది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ చాలా వైరల్ గా మారుతూ వచ్చాయి. ఇక తాజాగా ఈ రోజున సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇది ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెంచేశాయనే చెప్పవచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సాయి పల్లవి మరొకసారి తన నటనతో మెస్మరైజ్ చేసింది అని చెప్పవచ్చు. ఇక రానా కూడా మరొకసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.

ఈ సినిమాలో హీరో రానా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు.. ఇక అతడి భావజాలను ఇష్టపడే ప్రేమించే యువతిగా సాయి పల్లవి చిత్రంలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రానా కామ్రేడ్ రవన్న గా కనిపించనున్నారు. సాయి పల్లవి తో పాటు కొందరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక 1990 సంవత్సరం నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ నే విరాట పర్వం చిత్రంగా తెరకెక్కించారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: