ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన కేవీ గుహన్ `118`చిత్రంతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే సూపర్హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకం పై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు `హైవే` (ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టారు. ఇక ఈ సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో సైకో కిల్లర్-క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది. కాగా ఈ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలను ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. అంతే కాకుండా ఈ మూవీ రెగ్యులర్షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సంధర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ....నేను ఫస్ట్ టైమ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాను.
గుహన్ గారు సూపర్ కెమెరామేన్. ఆయన దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాననే నమ్మకం ఉంది. తప్పకుండా ఒక గ్రేట్ మూవీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఎంఎల్ఎ గాదరి కిశోర్కుమార్ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన గుహన్ గారికి, వెంకట్ తలారి గారికి, రమేష్గారికి దన్యవాధాలు`` అని చెప్పారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆనంద్ దొరసాని సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అనుకున్న మేర విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా తరవాత ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలడీస్ అనే మరో సినిమాలో హీరోగా నటించారు. కరోనా వేళ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆనంద్ హైవే అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.