ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇటీవల తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ముంబై తాజ్ హోటల్లో వీరి వివాహం జరిగింది. కరోనా కారణంగా తక్కువ మంది అతిథులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.వీరి పెళ్లి తంతు అంత అయిపోయాక తిరిగి వచ్చిన కాజల్ ఆచార్య షూటింగ్కు హాజరైంది. పెళ్లి చేసుకున్నా సినిమాలకు మాత్రం దూరం కాలేదీ బ్యూటీ. వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకెళుతోంది. ఇక అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ ఒక రా ఆఫీసర్ గా కనిపించబోతుంది.
ఇలా కాజల్ తర్వాత వరస సినిమాలతో ఒక రేంజ్ లో స్పీడ్ చూపిస్తుంది.అయితే ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న అని చెప్పారు. ఇక మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19న విడుదలయ్యింది.ఇక ఈ మద్యనే కాజల్ ఇంకొక సినిమాని లైన్ లో పెట్టింది. ఘోష్టి అనే పేరుతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తమన్నా ఈ మద్యనే విడుదల చేసింది.
ఇక ఈ సినిమాతో ప్రముఖ హీరో కమల్హాసన్ తో కాజల్ అగర్వాల్ ఇండియన్ 2.సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడటంతో షూటింగ్ నిలిచిపోయింది.దురదృష్టవశాత్తు చాలా కారణాల వల్ల ఇండియన్ 2మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాతలు, డైరెక్టర్ మధ్య విబేధాలున్నట్టు వార్తల్లో కూడా వచ్చింది. అదే సమయంలో క్రేన్ ప్రమాదం జరిగింది. కమల్హాసన్ బహిరంగంగా నిర్మాణ సంస్థ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్. పెళ్లి తర్వాత కూడా కాజల్ నటనలో గాని సినిమాలు ఒప్పుకోవడంలో గాని ఎలాంటి మార్పు రాలేదు.