మహానటి సావిత్రి బాటలో శృతి హాసన్.. విజయం సాధిస్తుందా...?

VAMSI
కమల హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కి... మొదట్లో లక్ కాస్త కలిసి రాలేదనే చెప్పాలి. అప్పట్లో ఈమె సినిమాల సంఖ్య పెరిగి... ప్రత్యేకమైన నటనతో గుర్తింపు తెచ్చుకొంది. కానీ మంచి హిట్ మాత్రం ఖాతాలో పడక పోవడంతో కాస్త డీలా పడింది. కానీ పవర్ స్టార్ సరసన చేసిన గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈమె దశ తిరిగిందనే చెప్పాలి. వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసి అగ్ర హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది శృతిహాసన్. హిట్, ఫ్లాప్ అనే లెక్కలను పక్కన పెట్టి అభిమానుల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంది ఈ  బ్యూటీ. 

తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు భాషలలో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్... ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా తనలోని మరో ప్రతిభను బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ గా కూడా అలరించిన శృతి... ఇప్పుడు ఓ చేత్తో పెన్ను, మరో చేత్తో మెగా ఫోన్ పట్టుకోడానికి రెడీ అయినట్లు సమాచారం. పోలీసు హీరోలకు లక్కీ హీరోయిన్ గా ఈమెకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే ఇటీవలే రవితేజ క్రాక్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ అందాల భామ.. 

ఇప్పుడు తాజాగా రచయిత్రిగా మారి ఓ కథను రాశారట. అంతేకాదు అన్నీ కుదిరితే తనే ఆ కథ కోసం డైరెక్టర్ గా మారబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. ఓ వైపు స్టార్ హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు డైరెక్టర్ గా మారేందుకు సన్నాహాలు చేస్తుందట శృతి. మరి ఈ అందమైన దర్శకురాలు ఏ సినిమా తో ప్రేక్షకులను పలకరించనుందో చూడాలి. ఈ విధంగానే అప్పట్లో మహానటి సావిత్రి చేసిన విషయం తెలిసిందే. అయితే శృతి హాసన్ కి ఈ విషయంలో కలిసి వస్తుందా లేదా తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: