సరిలేరు నీకెవ్వరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందా..??
మంచి కథతో తన వద్దకు వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ చెప్పాడు.నేడు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించారు. తాను మహేష్ బాబుతో మరో సినిమా చేసేందుకు ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన నుంచి ఎప్పుడు పిలుపిస్తే అప్పుడు వెళ్లి కథను విన్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది.ప్రస్తుతం మహేష్ బాబు.. గీతా గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది.
సినిమాలో మహేష్ ఓ బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది ..ఇక మహేష్ కి జోడిగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇక లాక్ డౌన్ తర్వాత.. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. సినిమాలో ఎక్కువ భాగం అమెరికా బ్యాక్ డ్రాప్ ఉండనుందని.. త్వరలోనే చిత్ర యూనిట్ ఓ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లబోతోందని.. ఇప్పటికే దానికి సంబంధించిన వీసా పనులు కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ సినిమా తర్వాత మళ్ళీ మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ అయితే మాత్రం.. మన మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టట్ పడ్డట్లేనని అంటున్నారు టాలీవుడ్ జనాలు...!!