టి20 వరల్డ్ కప్ కోసం.. భారత జట్టు ఇదేనట?

praveen
ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా జరుగుతున్న ఐపిఎల్ టోర్నీపై కాదు అందరి దృష్టి కూడా t20 వరల్డ్ కప్ కోసం ఎంపిక కాబోయే జట్టు పైనే ఉంది. జూన్ నెలలో ప్రారంభం కాబోయే పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో ఇక భారత జట్టులో ఎవరు సెలెక్ట్ అవుతారు అనే విషయం పైన ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

 అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకి వరల్డ్ కప్ జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయ్. ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ ఉద్దేశం ప్రకారం టి20 వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకోబోయే ఆటగాళ్లు ఎవరు అనే విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో పెద్దగా సత్తా చాటలేకపోతున్న కొంతమంది క్రికెటర్లను తమ టీం నుంచి ప్రక్కన పెట్టారు అన్న విషయం తెలిసిందే. మరి బీసీసీఐ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈసారి ఎవరికీ అదృష్టం వరించబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక టి20 వరల్డ్ కప్ కోసం బిసిసిఐ ఎంపిక చేయబోయే జట్టు ఇదే అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Espscricinfo ప్రకారం ఇక ఈ ఆటగాల్లే వరల్డ్ కప్ టీంలోకి ఎంపిక అవుతారు అంటూ ఇటీవల ఒక జట్టు వివరాలను ప్రకటన చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే ఆ వివరాలు చూసుకుంటే.. కెప్టెన్ గా రోహిత్ శర్మ, జైష్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు, పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, శివం దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్షదీప్, ఆవేష్ ఖాన్ లాంటి ప్లేయర్లు t20 వరల్డ్ కప్ లో ఎంపిక ఛాన్స్ ఉంది అంటూ తెలిపింది. అదే సమయంలో కేఎల్ రాహుల్, రవి బిష్ణయ్, సందీప్ శర్మ, చాహల్ కూడా రేసులో ఉన్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: