ఉత్తరాంధ్ర: రాజాంలో గెలుపు వైసీపీదా? టీడీపీదా?

Purushottham Vinay
•రాజాంలో ఆసక్తికరమైన పోరు
•జగన్ బదిలీలపై వైసీపీలో రచ్చ
•భారీ మెజారిటీతో గెలుపు టీడీపీదే

ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ సీటు నుంచి రెండు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే కంబాల జోగులుని పాయకరావుపేటకు జగన్ మోహన్ రెడ్డి షిఫ్ట్ చేశారు.దీంతో ఎక్కడ రాజాం, ఎక్కడ పాయరావుపేట అని అందరూ చర్చించుకున్నారు. రెండు నెలల ముందు ఈ బదిలీ జరిగింది. అయినా దీని మీద వైసీపీలో రచ్చ అలాగే కొనసాగుతూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వద్దు అని పాయకరావుపేట లో పెద్ద ఎత్తున  పోరు సాగింది. దాంతో పాటు ఆయన గ్రాఫ్ కూడా తగ్గడంతో ఈసారి ఆయనకు చెక్ పెడతారని ఊహించారు.అలా ఆయనకు రాజ్యసభ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దాంతో బాబూరావు హ్యాపీగా ఉన్నారు.అయితే ఆయన కోరిక ప్రకారం లోకల్ గా ఉన్న వైసీపీ నేతలకు టికెట్ ఇవ్వలేదా అన్న చర్చ సాగుతోంది. బాబూరావు తన మీద యుద్ధం చేసిన వారిలో ఎవరికీ టికెట్ ఇవ్వవద్దని అధినాయకత్వాన్ని కోరిన తరువాత రాజం నుంచి ఈ బదిలీ జరిగింది అని అంటున్నారు.ఇక రాజాం నుంచి వచ్చిన కంబాల జోగులుకు పాయకరావుపేటలో రాజకీయం పట్టు లేదు. అతనికి గొల్ల బాబూరావు అండ ఉండాల్సిందే.అలా అతనే అన్నీ చూసుకుంటున్నారు. అందువల్ల బాబూరావు పట్ల అసంతృప్తిగా ఉన్న వారు మళ్లీ తమ దారి తమదే అన్నట్లుగా ఉన్నారు.అలాగే ఇంకో వైపు చూస్తే నాన్ లోకల్ కార్డుతో టీడీపీ కూటమి జనంలోకి వెళ్తోంది. 


ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఓటేస్తారా అని ప్రచారం కూడా మొదలు పెట్టేసింది. దాంతో టీడీపీ కూటమికి ఈ పరిణామాలు కలిసి వస్తున్నాయి. తెలుగు మహిళా నాయకురాలు వంగలపూడి అనిత కూడా నిజానికి నాన్ లోకల్. ఆమె విశాఖలో ఉంటూ పాయకరావు పేటకు వస్తూంటారని పెద్ద విమర్శ.అయినా ఒకే జిల్లా కాబట్టి ఓకే అని  అనుకుంటున్నారు. దానికి కారణం రెండు జిల్లాల అవతల నుంచి కంబాల జోగులుని తెచ్చి వైసీపీ పెద్ద గీత గీయడమే అని తెలుస్తుంది. అనితకు ఇపుడు అంతా అనుకూలిస్తోందని తెలుస్తుంది. ఆమె అభ్యర్ధిత్వం వద్దు అన్న జనసేన పార్టీ కూడా సర్దుకుని పనిచేస్తోంది.వైసీపీ వర్గ పోరుతో కొంతమంది ఆమెకే మద్దతుగా నిలుస్తున్నారు. అదే విధంగా టీడీపీలో కూడా అందరూ ఐక్యంగా పనిచేస్తున్నారు. దీంతో గెలుపుకు ఢోకా లేదు భారీ మెజారిటీతో అనిత విజయం సాధించడం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: