ఆ విషయంలో అనుష్క శెట్టికి పోటీ ఇస్తున్న పూజా హెగ్డే

Suma Kallamadi
అల వైకుంఠపురములో సినిమాతో ఎనలేని పాపులారిటీని సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా దూసుకెళ్తుంది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్, అక్కినేని అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్డే కి ప్రస్తుతం అనేక సినీ అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి సినిమా "శాకుంతలం" లో పూజా హెగ్డే ని ఫీమేల్ లీడ్ రోల్ గా నటింపజేయాలని భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే కొద్ది రోజుల క్రితం అనుష్క శెట్టి ని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని చాలా మంది భావించారు. గుణశేఖర్ కూడా ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ లోగా పూజ హెగ్డే గుణశేఖర్ సినిమాలో కరెక్ట్ గా సూట్ అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో డైరెక్టర్ గుణశేఖర్ కూడా ప్రస్తుతం పూజా హెగ్డే హవా నడుస్తుందని.. ఆమెను తన సినిమాలో నటింపజేస్తే ప్లస్ అవుతుందని.. అనుష్క కంటే పూజాహెగ్డే కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

నిజానికి భారీ బడ్జెట్ సినిమాల్లో ఒక్క అనుష్క శెట్టిని నటింపజేసేనా.. నిర్మాతకు లాభాలు తప్ప నష్టాలు మిగలటం దాదాపు అసాధ్యం. ఎందుకంటే సాధారణంగా అనుష్క శెట్టి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. కథ యావరేజ్ గా ఉన్నా అనుష్క శెట్టి నటనా చాతుర్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదు. ఏ విధంగా చూసుకున్నా అనుష్క శెట్టి ఇమేజ్ ని తక్కువగా చేసి మాట్లాడలేం. కానీ ప్రస్తుతం పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అనుష్క శెట్టి రెగ్యులర్ సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. అందుకే డైరెక్టర్ గుణశేఖర్ అనుష్క శెట్టి ని సంప్రదించకుండా పూజా హెగ్డే నే సంప్రదించడానికి సన్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతిమంగా చూసుకుంటే పూజా హెగ్డే పాపులారిటీ అనుష్క శెట్టి కి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: