బాలీవుడ్ స్టార్ తో త్రిష రొమాన్స్.. 15 ఏళ్ళ తర్వాత అక్కడ రీ ఎంట్రీ?

Anilkumar
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది త్రిష. తెలుగు ఇండస్ట్రీలో ఈ బుట్ట బొమ్మకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. టాలీవుడ్ లో దాదాపుగా అందరి హీరోల సరసన నటించింది. చిరంజీవి - వెంకటేష్ - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.  టాలీవుడ్ కు ఈమధ్య దూరంగా ఉంటూ తమిళ్ సినిమాలపై ఫోకస్ చేస్తుంది.
 త్రిష ఈమధ్య కాలంలో పొన్నియన్ సెల్వన్ తో మంచి హిట్ ను అందుకుంది.  అయితే త్రిష ఇప్పుడు బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సౌత్ సెలబ్రిటీలు ఇప్పటికే చాలామంది బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అలరిస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ లో అడుగు పెట్టి జవాన్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. అలాగే త్రిష కూడా ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. త్రిష గతంలో నిజానికి ఓ బాలీవుడ్ సినిమా చేసింది. 2014లో విడుదలైన 'కట్ట మిట్ట' సినిమాలో త్రిష జిల్లా కలెక్టర్ గా పాత్ర పోషించింది. అయితే త్రిష మళ్లీ 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. త్రిష ఓ స్టార్ హీరో తో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది.

క సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో త్రిష నటించనుందని టాక్ వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమాలో త్రిష కూడా నటిస్తుందని సమాచారం. తమిళంలో  ఏఆర్ మురుగదాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సికిందర్ సినిమాలో త్రిష రెండో కథానాయకిగా ఎంపిక చేశారని సమాచారం. ఇక త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్లు అవుతున్న ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఐదు సినిమాలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: