ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోయిన్‌పై కేసు.. హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ!

JSR
బాలీవుడ్‌ మేకర్స్‌ మహేష్ భట్‌, ముఖేష్‌ భట్‌లతో పాటు హీరోయిన్‌ అలియా భట్‌లపై కేసు నమోదైంది. సడక్‌ 2 సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న కారణంతో గురువాతం వీరి మీద కేసు వేశారు. సికందర్‌ పూర్ కు చెందిన ఆచార్య చంద్ర కిశోర్‌ పరాషర్ అనే వ్యక్తి అడ్వకేట్‌ సోను కుమార్‌ ద్వారా ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.

కేసు విచారణకు అంగీకరించిన చీష్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ముకేష్‌ కుమార్‌ జూలై 8న విచారణ జరుపుతామని వెల్లడించారు. ఐసీసీ సెక్షన్‌ ల 295ఏ, 120బీ కేసును నమోదు చేశారు. సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో కైలాస్‌ మానస సరోవర్‌ నుచూపించినందుకు ఈ  కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.

సడక్ 2 సినిమాను 1990లో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అయిన సడక్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించారు. ముఖేష్ భట్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో మహేష్ భట్‌ రెండు దశాబ్దాల తరువాత దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడి కూతురు అలియాతో పాటు ఈ సినిమాతో సంజయ్‌ దత్‌, పూజా భట్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1991లో రిలీజ్‌ అయిన సడక్‌ సినిమాలోనూ సంజయ్‌, పూజాలు జంటగా నటించారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
When you come to the end, you discover that there is no END.

A post shared by {{RelevantDataTitle}}