ఆఫ్రికా లో తెగ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్...!!

murali krishna
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తు్న్నారు. ఇటీవలే ఈ మూవీ జపాన్ ‏లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ రాజమౌళి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ జపాన్‏ లో సందడి చేశారు. అక్కడ ట్రిపుల్ ఆర్ చిత్రాని కి అద్భుతమై న స్పందన లభించింది. ఇక జపాన్ నుంచి రామ్ చరణ్ దంపతులు ఆఫ్రికా చేరుకున్నారు. ప్రస్తుతం ఆఫ్రికాలో ని అడవి ప్రాంతంలో చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి ఒడిbలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంటూ.. వన్యప్రాణుల ను ఫోటోస్ తీస్తూ కనిపించారు చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించి న వీడియో నెట్టింట తెగ వైరలవుతుందట..
చెర్రీకి మొదటి నుంచి ఫోటోగ్రఫి పై మంచి ఆసక్తి ఉంది. ఇక తాజా గా నెట్టింట వైరలవుతున్న వీడియో లో చరణ్ స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్లారు. అక్కడ పులిని.. వన్యప్రాణులను ఫోటోస్ తీయడం గమనించ వచ్చు. మొత్తాని కి ఆర్ఆర్ఆర్ విజయాన్ని చరణ్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండ గా.. కీలక పాత్ర లో మరో హీరోయిన్ అంజలి కనిపించ నుందని తెలుస్తుంది..
పొలిటికల్ నేపథ్యం లో రాబోతున్న ఈ మూవీ లో చరణ్.. డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు గా సమాచారం. ఇటీవల ఈ నుంచి లీకైన ఫోటోస్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాని కి ప్లాన్ చేస్తున్నార ట మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: