బిగ్ బాస్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఏమో గానీ కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.తెలుగు లో ప్రసారం అయిన నాలుగు సీజన్ లలో అంతగా లేని గొడవలు సీజన్ 5 లో జరిగాయి. హౌస్ లో వున్న ఇద్దరికీ తమ లవర్స్ భారీ షాక్ ఇచ్చారు. వారి నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నారు.. దీప్తి సునయన, షణ్ముఖ్ ఈ మధ్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో పెయిర్ ఉన్నట్లు తెలుస్తుంది. వారిద్దరు కూడా దాదాపు విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్.. త్వరలోనే ఆమెకు గుడ్ బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు.. ఇది అంతటా అనుమానాలకు దారి తీసింది..
తాజాగా సిరి తో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్స్టాగ్రామ్ లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చాడు . కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్లకు సంబంధించిన అప్డేట్స్ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. షణ్నూ తో కనెక్షన్ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్ భరించలేక శ్రీహాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరూ నిజంగానే విడిపోతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బిగ్ బాస్ కలపడం మాత్రమే కాదు.. విడగోడుతుంది అని వీరి ఇద్దరి జంటలను చూస్తె అర్థం అవుతుంది.