శృంగారంలో వెరైటీ కోసం ఆంటీ ఆ పని చేస్తే.. అసలుకే మోసం వచ్చింది..!?
వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని నాగ్ పుర్ కు చెందిన 30ఏళ్ల యువకుడికి స్థానికంగా ఉండే ఓ ఆంటీతో అయిదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అప్పుడప్పుడూ వీరు బయటకు వెళ్లి హోటళ్లలో ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే గురువారం రాత్రి కూడా వీరు లాడ్జికి వెళ్లారు. రొటీన్ శృంగారంతో బోర్ కొట్టిందన్న ఆంటీ ఆ యువకుడిని వెరైటీగా చేయమని ప్రోత్సహించింది. అందులో భాగంగా శృంగారం సమయంలో ఆ యువకుడి కాళ్లు, చేతులను ఆమె నైలాన్ తాడుతో ఓ కుర్చీకి కట్టేసింది. మెడ చుట్టూ మరో తాడు బిగించింది.
ఇలా శృంగారం చేస్తే కామోద్దీపన కలిగి శృంగారంలో మరింత సుఖం ఉంటుందని ఆమె భావించింది. అలాగే కొద్దిసేపు శృంగారం చేసిన తర్వాత.. ఆ యువకుడిని కుర్చీకి అలా ఉండగానే ఆమె బాత్ రూమ్కు వెళ్లింది. అయితే ఇంతలో కుర్చీ జారి కిందపడింది. అంతే.. యువకుడి మెడ చుట్టూ తాడు ఉచ్చులా బిగుసుకుంది. ఇంకేముంది.. ఊపిరాడక చనిపోయాడు. ఏం చేయాలో తెలియని ఆ ఆంటీ చివరకు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పేసింది.
పోలీసులు ఆ ఆంటీని నిర్బంధంలోకి తీసుకుని, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసు విచారణలో ఆమె తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అంగీకరించింది. వాంగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి మొబైల్స్ సీజ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.