శృంగారంలో వెరైటీ కోసం ఆంటీ ఆ పని చేస్తే.. అసలుకే మోసం వచ్చింది..!?

రొటీన్‌ గా చేస్తే ఏ పని అయినా బోర్‌ కొడుతుంది.. అందుకే చాలా మంది వెరైటీ కోసం ప్రయత్నిస్తారు. కొందరు శృంగారంలోనూ వెరైటీ కోరుకుంటారు. అందులో తప్పు లేదు.. కానీ..అలా వెరైటీ శృంగారం కోసం ఓ ఆంటీ చేసిన ప్రయత్నం ఏకంగా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఓ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ తనను కాళ్లు చేతులు కట్టేసి శృంగారం చేయమంటాడు.. గుర్తుందా.. అలాగే ఓ ఆంటీ చేసిన ప్రయత్నం వికటించింది. శృంగారంలో స్వర్గ సుఖాలు అనుభవించాలని ఓ ఆంటీ చేసిన వింత పని ప్రియుడి ప్రాణం తీసింది.
వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని నాగ్ పుర్ కు చెందిన 30ఏళ్ల యువకుడికి స్థానికంగా ఉండే ఓ ఆంటీతో అయిదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అప్పుడప్పుడూ వీరు బయటకు వెళ్లి హోటళ్లలో ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే గురువారం రాత్రి కూడా  వీరు లాడ్జికి వెళ్లారు. రొటీన్ శృంగారంతో బోర్ కొట్టిందన్న ఆంటీ ఆ యువకుడిని వెరైటీగా చేయమని ప్రోత్సహించింది. అందులో భాగంగా  శృంగారం సమయంలో ఆ యువకుడి కాళ్లు, చేతులను ఆమె నైలాన్ తాడుతో ఓ కుర్చీకి కట్టేసింది. మెడ చుట్టూ మరో తాడు బిగించింది.
ఇలా శృంగారం చేస్తే కామోద్దీపన కలిగి శృంగారంలో మరింత సుఖం ఉంటుందని ఆమె భావించింది. అలాగే కొద్దిసేపు శృంగారం చేసిన తర్వాత.. ఆ యువకుడిని కుర్చీకి అలా ఉండగానే ఆమె బాత్‌ రూమ్‌కు వెళ్లింది. అయితే ఇంతలో కుర్చీ జారి కిందపడింది. అంతే..  యువకుడి మెడ చుట్టూ తాడు ఉచ్చులా బిగుసుకుంది. ఇంకేముంది.. ఊపిరాడక చనిపోయాడు. ఏం చేయాలో తెలియని ఆ ఆంటీ చివరకు పోలీసులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పేసింది.
పోలీసులు ఆ ఆంటీని నిర్బంధంలోకి తీసుకుని, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసు విచారణలో ఆమె తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అంగీకరించింది. వాంగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి మొబైల్స్ సీజ్‌ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: