వైసీపీకి షాక్: ఆ 2 జిల్లాలను టీడీపీ స్వీప్ చేస్తుందా?
ఈ సారి ముఖ్యంగా వైసీపీలో టికెట్లు రాని వారు, అక్కడ ఉండి గెలవలేని వాళ్లే టీడీపీ టార్గెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే వారికి టికెట్ ఇచ్చి.. గెలుపు బాట పట్టించాలని చూస్తున్నారు. ఒక వేళ గతంలో ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన వారైతే ఎలా ముందుకు వెళతారన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. టీడీపీ, ఈ సారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు అనుకూల పవనాలు ఉన్నట్లు చంద్రబాబు కార్యకర్తల్ని ఉత్సహ పరుస్తున్నారు.
నిజమే ఇలా ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్పీప్ అయితే రేపు రాబోయే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అవుతోంది. 1999 టీడీపీ ప్రభంజనం సమయంలో కాంగ్రెస్ 23 స్థానాలే గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ అదే సీన్ రీపిట్ అవుతుందని తెలుగు దేశం నాయకులు దృఢంగా నమ్ముతున్నారు. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఎలాంటి మలుపులు వస్తాయో.. ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుంది. ఎవరు గెలుస్తారు.. ఎవరూ ఓడతారన్నది వేచి చూడక తప్పదు.