సూసైడ్ నోట్లో ఆమె రాసిన మాటలు.. పోలీసులకే కన్నీళ్లు తెప్పించాయ్?
అయితే ఇక తల్లిదండ్రులు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత కూడా ఇక ఆడపిల్లకు కాస్తయినా ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఎందుకంటే పెళ్లినాడు పెట్టిన కాళ్ల పారాణి ఆరకముందే వరకట్న వేధింపులకు ఆడపిల్ల బలవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఎంతోమంది అమ్మాయిలు అత్తింటి వేధింపులకు భర్త పెట్టే హింసలకు బలవుతూ చివరికి ఆ బాధలను తల్లిదండ్రులకు చెప్పలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కుందనపు బొమ్మల ఏ కష్టం రాకుండా పెంచుకున్న కూతురుని ఒక అయ్య చేతిలో పెడితే చివరికి విగతజీవిగా మళ్లీ ఆ తల్లిదండ్రులకే అందిస్తున్నారు అత్తారింట్లో ఉన్న రాక్షసులు.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే అమ్మాయి అందరి ఆడపిల్లల్లా కాదు.. ఎంతో ధైర్యవంతురాలు. కానీ భర్త వేధింపులు తాళలేక చివరికి ఉరితాడుకు వేలాడింది. ఇక ఆమె చనిపోతూ తాను అత్తారింట్లో నరకం అనుభవించిన తీరును సూసైడ్ నోట్లో రాసింది. అయితే సూసైడ్ నోట్లో ఆమె చెప్పిన మాటలు చివరికి పోలీసులకే కన్నీళ్లను తెప్పించాయి. ఈ విషాదకర ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మైసూర్ కు చెందిన రాఘవేంద్ర తో మాండ్య జిల్లా కెఆర్ పేట్ తాలూకా లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రేమకుమారి కి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఐదు లక్షల కట్నం 150 గ్రాముల బంగారం అందించారు. అయితే పెళ్లైన మూడు నెలలకి భర్త అతడి కుటుంబ సభ్యులు నిజస్వరూపం బయటపడింది. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. భర్త మంచివాడిగా నటిస్తూ చేస్తున్న మోసాన్ని బెదిరింపులు ఎదురుకోలేక చివరికి ఉరి వేసుకుంది 64 లక్షలు కావాలంటూ హింసించాడు డబ్బులు తీసుకురాకపోతే చంపేస్తాను అంటూ బెదిరించాడు. నా చదువుతో త్వరలో లాయర్ కాబోతున్న. కానీ నిత్యం అతని కోపాన్ని భరించలేక బ్రతకలేకపోతున్నా. నేను ధనవంతుల బిడ్డనే. కానీ అతనికి డబ్బు ఇవ్వాలని లేదు. నాకు చనిపోయే ధైర్యం కూడా లేదు. బతకాలని కోరిక లేదు. అందుకే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడుతున్న అంటూ ఆమె సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది.