ఇదెక్కడి విడ్డూరం.. బోరింగ్ కొడితే మద్యం వస్తుంది?

praveen
సోషల్ మీడియా ప్రస్తుతం అంతట పాకిపోయిన నేపథ్యంలో ఇక ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా కొంతమంది నేరస్తులు ఇక అక్రమాలకు పాల్పడేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ వుంది. సాధారణంగా అయితే సినిమాల్లోని డైరెక్టర్లు ఇలా నేరస్తులు ఎలా నేరాలకు పాల్పడతారు.. అనే విషయంలో కాస్త క్రియేటివ్ గా ఆలోచించి సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు.

 ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు నేరస్తులకు రావడం కాస్త కష్టమే అనుకుంటారు. కానీ ఏకంగా సినిమాలకు మించిన క్రియేటివిటీ తో ఇటీవల కాలంలో ఎంతోమంది అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇప్పుడైతే ఎక్కడ బోరింగులు కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం నీటి కోసం ప్రతి ఒక్కరు కూడా బోరింగ్ దగ్గరికి వెళ్లి బోరింగ్ కొడుతూ ఇకముందు బకెట్ లాంటిది పెట్టి నీరు నింపుకునేవారు. అయితే ఇక్కడ పొలంలో కొన్ని బోరింగులు కనిపించాయి. కానీ ఆ బోరింగ్ లను కొడితే నీరు రావడం లేదు  ఏకంగా మద్యం వస్తూ ఉండడం గమనార్హం.

 అదేంటి ఎక్కడ బోర్ వేసినప్పుడు నీళ్లు పడతాయి. అందుకే బోరింగ్ కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఈ బోరింగ్ నుంచి మద్యం ఎలా వస్తుంది అని అవాక్కవుతున్నారు కదా. ఇదంతా అక్రమార్కుల క్రియేటివిటీ. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో గల పరగణ గ్రామంలో విచిత్ర కర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా చేతిపంపు కొడితే నీటికి బదులు మద్యం వచ్చింది. ఆ ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. అయితే పొలాల్లో అధిక సంఖ్యలో బోరింగులు ఉండడం చూసి అనుమానించి వాటిని పరీక్షించారు  అయితే  చేతిపంపులను కొట్టి చూడక అందులో నుంచి మద్యం వచ్చింది. ఏకంగా పొలంలో కింద మద్యం డ్రమ్ములను ఏర్పాటు చేసి ఇలా పొలంలో ఏకంగా చేసి పంపులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: