సాయం చేయాలనుకున్నారు.. కానీ చివరికి ప్రాణాలు పోయాయి?

praveen
ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇజ్రాయిల్ ఏకంగా మెరుపు దాడులు చేస్తూ ఉంది. ఇక ఈ దాడులలో ఏకంగా సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్ దాడుల తో అటు గాజా చిగురుటాకుల వనికి పోతుంది. ఏకంగా అక్కడ ప్రజలు ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియక ప్రాణాలను అర చేతి లో పట్టుకుని బ్రతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితుల పై ఏకంగా ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ్. అయితే ఇలా ఇరుదేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో గాజాలో అస్తవ్యస్తంగా పరిస్థితులు మారిపోయాయ్. కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులను నేపథ్యంలో గాజాకు  విదేశాలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎయిర్ డ్రాప్ ద్వారా సహాయాన్ని అందిస్తున్నాయి అనే విషయం తెలిసిందే.

 అయితే ఇక్కడ ఏకంగా సహాయం చేసే గుణం కూడా చివరికి ప్రాణాలు కోల్పోవడానికి కారణంగా మారిపోయింది. ఇక ఏకంగా ప్రాణాలను నిలబెట్టడానికి చేసిన సహాయమే దురదృష్టవశాత్తు ప్రాణాలను బలి తీసుకుంది. అల్ సతీ అనే శరణార్థుల శిబిరం వద్ద ఓ దుర్ఘటన జరిగింది. పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఒక భారీ పార్సిల్ అక్కడి ప్రజల మీద పడిపోయింది. ఈ ఘటనలో ఏకంగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పాలి. అయితే ఈ ఎయిర్ డ్రాప్ ఎవరు చేశారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరిగినప్పటికీ ప్రతిసారి కూడా విఫలమవుతూనే ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: