సప్లమెంటరీ ఎగ్జామ్ రాసింది.. పాస్ అవుతానో లేదో అని ఏం చేసిందో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎగ్జామ్స్ సీజన్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక వివిధ దశల్లో చదువుకొని కొనసాగిస్తున్న విద్యార్థులు చివరికి పరీక్షలు రాస్తూ ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం పుస్తకాల పురుగులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎంతోమంది తమ టాలెంట్  నిరూపించుకొని ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకును సొంతం చేసుకోవాలని.. తెగ కష్టపడి పోతున్నారు. ఈ క్రమంలోనే ఎగ్జామ్స్ కి సంబంధించిన ఏ న్యూస్ బయటికి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో ఎగ్జామ్స్ ఎంతోమంది జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నాయి. ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా చివరికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారూ. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఆమె ఇంటర్ చదువుతుంది . అయితే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది . అయినప్పటికీ అతను నిరాశ చెందలేదు. సప్లమెంటరీ ఎగ్జామ్ రాసింది. అయిన అతనికి అదృష్టం కలిసి రాలేదు. మరోసారి ఫైల్ అయ్యింది. ఇలా పలుమార్లు సప్లమెంటరీ పరీక్షలు రాసిన ఆమె మాత్రం పాస్ కాలేకపోయింది. చివరికి తన జీవితం ఇంతే అని ఆమె ఎంతగానో నిరాశ చెందింది. ఇక ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని అనుకుంది.

 తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతే తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన దానిని అవుతాను అని మాత్రం ఆలోచించ లేకపోయింది సదరు యువతి. చివరికి ఇక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బిల్డింగ్ పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బాచుపల్లి లో ఉండే విద్యార్థినీ గతంలో పరీక్ష రాసి ఫెయిల్ అయింది. ఈ క్రమంలోనే రెండేళ్లుగా సప్లమెంటరీ పరీక్షలు రాసిన ఫలితం లేకపోయింది. ప్రస్తుతం మళ్ళీ పరీక్ష రాసిన విద్యార్థిని ఈసారైనా పాస్ అవుతానో లేదో అన్న భయంతో చివరికి ఆత్మహత్య చేసుకుంది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: