దొంగలే కానీ మంచి దొంగలు.. వాటిని తిరిగిచ్చేశారు?

praveen
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అనే ఒక వాక్యం  బాగా ప్రసిద్ధి. అయితే ఈ వ్యాఖ్యాన్ని నేటి జనరేషన్ వాళ్ళు తమకు నచ్చినట్టుగా మార్చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త పదాలను చేర్చి ఇష్టం వచ్చినట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన గురించి చెప్పుకోవాలంటే దొంగలందు మంచి దొంగలు వేరయ్య అని ఈ కావ్యాన్ని మార్చొచ్చు. ఎందుకు అంటారా.. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే నేను చెప్పేది నిజమే అంటారు మీరు కూడా. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడతా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా బయటికి వెళ్లారు. అంటే చాలు తిరిగి వచ్చేసరికి ఇల్లును గుల్ల చేసేస్తూ ఉన్నారు దొంగలు.

 అందిన కాడికి దోచుకుపోతూ చివరికి ఇంటి యజమానులకు షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏకంగా బంగారం విలువైన వస్తువులు నగదు లాంటివి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఇక వాటిని చోరీ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఒక్కసారి చోరీ చేసిన తర్వాత పనికిరాని వస్తువు వారి చేతికి దొరికినా కూడా దానిని మళ్లీ తిరిగి ఇవ్వడానికి దొంగలు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది మాత్రం దొంగలే కానీ మంచి దొంగలేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది.

 ఎందుకంటే అందరిలాగానే ఇంట్లోకి చోరీకి పాల్పడి నగదు బంగారం విలువైన వస్తువులు దోచుకు వెళ్లారు. వారు దోచుకు వెళ్లిన వాటిలో అవార్డులు కూడా ఉన్నాయి. అయితే అన్ని దోచుకెళ్ళిన దొంగలు ఆ అవార్డులను మాత్రం మళ్ళి తిరిగి ఇచ్చేసారు. కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో ఇలా చోరీ జరిగింది. అయితే ఆ దొంగలు ఆ డైరెక్టర్ కు వచ్చిన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చి ఒక లేఖ రాసి పెట్టారు. ఆ బాధ్యతలను దొంగలించినందుకు క్షమించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ లెటర్ ను అవార్డులను ఒక కవర్లో పట్టి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. మధురై లోని ఉసిలం పట్టి లో ఇలా చోరీ జరగగా.. లక్ష నగదు ఐదు సవర్ల బంగారం ఎత్తుకు వెళ్లారు దొంగలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: