దొంగలే కానీ మంచి దొంగలు.. వాటిని తిరిగిచ్చేశారు?
అందిన కాడికి దోచుకుపోతూ చివరికి ఇంటి యజమానులకు షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏకంగా బంగారం విలువైన వస్తువులు నగదు లాంటివి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఇక వాటిని చోరీ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఒక్కసారి చోరీ చేసిన తర్వాత పనికిరాని వస్తువు వారి చేతికి దొరికినా కూడా దానిని మళ్లీ తిరిగి ఇవ్వడానికి దొంగలు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది మాత్రం దొంగలే కానీ మంచి దొంగలేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది.
ఎందుకంటే అందరిలాగానే ఇంట్లోకి చోరీకి పాల్పడి నగదు బంగారం విలువైన వస్తువులు దోచుకు వెళ్లారు. వారు దోచుకు వెళ్లిన వాటిలో అవార్డులు కూడా ఉన్నాయి. అయితే అన్ని దోచుకెళ్ళిన దొంగలు ఆ అవార్డులను మాత్రం మళ్ళి తిరిగి ఇచ్చేసారు. కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో ఇలా చోరీ జరిగింది. అయితే ఆ దొంగలు ఆ డైరెక్టర్ కు వచ్చిన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చి ఒక లేఖ రాసి పెట్టారు. ఆ బాధ్యతలను దొంగలించినందుకు క్షమించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ లెటర్ ను అవార్డులను ఒక కవర్లో పట్టి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. మధురై లోని ఉసిలం పట్టి లో ఇలా చోరీ జరగగా.. లక్ష నగదు ఐదు సవర్ల బంగారం ఎత్తుకు వెళ్లారు దొంగలు.