యువకుడు సూసైడ్.. పక్కింటి ఆంటీపై కేసు?

praveen
ఈ మధ్యకాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనిషికి కనిపిస్తున్న ఒకే ఒక పరిష్కారం కేవలం ఆత్మహత్య మాత్రమే. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగం, వ్యాపారం చేసుకునే విద్యావంతులు వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇక ఇలా విచక్షణ లేకుండానే ఆలోచిస్తూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయి అక్కడితో జీవితం ఆగిపోయింది అని భావిస్తూ.. చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అయితే క్షణికావేశంలో తీసుకున్న ఆత్మహత్య అనే నిర్ణయం ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతూ ఉండు.

 అయితే ఇలా ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు అందుకు గల కారణాల గురించి ఎంతోమంది ప్రతి రోజు వార్తలు చూస్తున్నప్పటికీ ఎవ్వరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో  కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఒక యువకుడు క్షణికావేషంలో నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు పక్కింటి ఆంటీ పై కేసు నమోదు చేశారు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే ఇక సదరు మహిళకు కోర్టు శిక్ష కూడా వేయడం గమనార్హం.

 పెద్ద శంకరంపేట మండలం వీరోజీపల్లి వాసి మొగులమ్మ భర్త చనిపోవడంతో పటాన్చెరులో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోని శివాయ పల్లికి చెందిన లింగం అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల పాటు తనను ప్రేమించాలి అంటూ అతన్ని వేధించడం మొదలు పెట్టింది  మొగులమ్మ. ఈ క్రమంలోనే 2019 జులై 24వ తేదీన యువకుడు మనస్థాపంతో ఉరి వేసుకున్నాడు. అయితే అతని మరణానికి కారణమైన పక్కింటి మహిళను అరెస్టు చేసి కోర్టుమందు హాజరుపరిచాలు పోలీసులు. ఈ క్రమంలోనే విచారణ అనంతరం ఇటీవల మూడేళ్ల జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: