ఛీ వీడు తండ్రేనా.. అందుకోసమే పిల్లలని కన్నాడేమో?
అందుకే తండ్రి ప్రేమను కూడా మాటల్లో వర్ణించలేం అని చెప్పాలి. కానీ ఇక కొంతమంది మాత్రం ఏకంగా కన్న బిడ్డలకు విషయంలో యమకింకరులుగా మారిపోతూ ఉంటారు. ఏకంగా ఏ తండ్రి చేయని నీచమైన పనులు చేస్తూ చివరికి తండ్రి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయిన ఒక వ్యక్తి ఏకంగా కన్న బిడ్డలనే ఎత్తుకు వెళ్లి అమ్మేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా పిల్లలను అమ్ముకొని డబ్బులు సంపాదించేందుకే వారిని కన్నాడు అన్న విధంగా ఆ తండ్రి నీచంగా ప్రవర్తించాడు.
బూత్ పూర్ మండలం తాడిపర్తికి చెందిన రఫిక్, అభిబున్నీసా దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వీరూ జడ్చర్ల నివాసం ఉంటున్నారు. అయితే రఫిక్ ఇటీవల కాలంలో చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే పనికి కూడా వెళ్లట్లేదు. భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత తన 7, 3, 2 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలను కూడా చాక్లెట్ ఇప్పిస్తానని బైక్ ఫై తీసుకువెళ్లాడు. అయితే అనుమానం వచ్చిన భార్య పోలీసులను ఆశ్రయించింది. మొబైల్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ యాకత్పుర రైల్వే స్టేషన్ వద్ద రఫీక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే హైదరాబాద్లో ఉన్న బంధువులను అప్రమత్తం చేసి వారి సహాయంతో రఫిక్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముగ్గురు పిల్లలను 9 లక్షలకు అమ్మకానికి పెట్టి గోవాకి తరలించాలని అనుకున్నట్లు రఫిక్ చెప్పడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు.