అసలు వీడు మనిషేనా.. ట్రైన్ లో యువతి ముందు హస్త ప్రయోగం.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో కళ్ళ ముందు మహిళలు కనిపించారు అంటే చాలు చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అని ఆలోచించకుండా.. ఏకంగా కామంతో రెచ్చిపోతున్న నీచులే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. మన దేశంలోనే కాదు ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కామాంధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. దీంతో ఇక మహిళల రక్షణ రోజు రోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి ట్రైన్ లో ఒక మహిళా ప్రయాణికురాలిపట్ల ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా సిగ్గుపడేలా చేస్తూ ఉంది.

 ఉత్తర లండన్ లోని వేంబ్లీలో నివసించే ముఖేష్ షా అనే 43 ఏళ్ల భారత సంతతి వ్యక్తి.. 2022 నవంబర్ 4వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో సాడ్బరీ టౌన్ నుంచి ఎక్ టన్ టౌన్ వెళ్లే రైలు ఎక్కాడు. అయితే అతను ఎక్కిన భోగిలో ఇక ప్రయాణికులు ఎవరూ లేరు. కేవలం ఒక్క యువతి మాత్రమే ప్రయాణిస్తుంది. దీంతో ఇక అతను పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా రెచ్చిపోయాడు. భోగి అంతా ఖాళీగా ఉండడంతో అతనిలోని కామాంధుడు బయటికి వచ్చేసాడు. ఏకంగా ముఖేష్ ఎక్కడో దూరంగా కూర్చోకుండా నేరుగా యువతీ ఎదురుగా కూర్చుని అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

 ఆ యువతి ఎంత వారించినా అతను మాత్రం వినిపించుకోలేదు. ఏకంగా ఆ యువతీ ముందే ప్రైవేట్ పార్ట్ బయటకు తీసి హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. పైగా తాను తప్పుడు పనిచేయట్లేదు అన్నట్లుగా సమర్ధించుకున్నాడు. దీంతో ఇక అతని ప్రవర్తనతో ఎంతగానో ఇబ్బంది పడిపోయిన యువతి.. ఇదంతా సెల్ఫోన్లో వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముఖేష్ ను అరెస్టు చేశారు. ఇక ఇందుకు సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల సదరు నిందితుడికి 9 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. కాగా అసభ్య ప్రవర్తనకు పాల్పడిన నేరస్తులు రిజిస్టర్ లో 10 ఏళ్లపాటు రోజు సంతకం చేయాల్సి ఉంటుంది అంటూ న్యాయమూర్తి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: