కష్టపడి ఉద్యోగం సాధించింది.. కానీ అంతలోనే?

praveen
అంత సంతోషంగా సాగి పోతుంది అనుకుంటున్న సమయంలో విధి చిన్నచూపు చూస్తే.. ఊహించని ఘటన లు  జీవితాన్ని తలకిందులు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఇక జీవితమే ముగిసిపోయే పరిస్థితులను కూడా తీసుకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన ఆ యువతి ఎంతో కష్టపడి చదివింది  ఎమ్ ఎల్ హెచ్ పి పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఆరోగ్య శాఖలో ఉద్యోగం సంపాదించేందుకు ఎంతో కష్టపడింది. చివరికి అనుకున్నది సాధించింది. ఇక ఉద్యోగం రావడంతో కుటుంబానికి అండగా నిలవాలని అనుకుంది.

 అన్నీ తానై అమ్మానాన్నలను చూసుకోవాలని భావించింది. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది. అప్పుడు వరకు స్వల్ప అనారోగ్యం కాస్తా తీవ్రరూపం దాల్చింది. చివరికి ఆ యువతి రోజుల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్ఎం నల్లి విజయ్ కుమారి ఆకస్మిక మృతి కుటుంబంలో విషాదం నింపింది. ఏఎన్ఎం గా ఉద్యోగం రావడంతో పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి పీహెచ్సీలో లో చేరింది సదరు యువతి.

 ఇలా అనుకున్న ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషం లో ఉంది. అయితే ఉద్యోగంలో చేరి పది రోజులు కూడా కాలేదు అనారోగ్యం బారిన పడింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను రాజమహేంద్రవరం తరలించి అక్కడ చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ చివరికి ఆరోగ్యం విషమించి ప్రాణాలు వదిలింది. ఇక యువతి మృతిపై తల్లిదండ్రులు మాత్రమే కాదు గ్రామస్థులు కూడా కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన తర్వాత ఇలా ఇలా జరగడంతో ఎంతోమంది విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: