20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటారా?
ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి భారాస నేతలు విమర్శిస్తున్నారన్నారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ చెబుతున్నారని.. బీఆర్ఎస్ నేతలు భయాందోళనలో ఉన్నారని జగ్గారెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తారని భయపడుతున్నారని.. వలసలు ఆపుకునేందుకు జిమ్మిక్కు చేయాలని చూస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. జగన్, కేసీఆర్ బీజేపీ ఆదేశాలతోనే పని చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. తెలంగాణ అభివృద్ధి చెందవద్దని కేసీఆర్, జగన్ కుట్ర చేస్తున్నారన్నారు.