వారెవా.. కేసీఆర్ ఖజనాకు డబ్బే డబ్బు?
ఈ ఆదాయాన్ని గత ఏడాది ఆగస్టు రాబడితో పోలిస్తే ఏకంగా 25 శాతం ఎక్కువగా చెప్పొచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడిని విశ్లేషిస్తే.. ఈ ఆర్థిక ఏడాదిలో మొదటి 5 నెలలోనే వాణిజ్య శాఖ ద్వారా తెలంగాణ ఖజానాకు రూ. 29,103 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 17 శాతం ఎక్కువ. ప్రత్యేకించి పెట్రోలియం ఉత్పత్తులు, మద్యంపై అమ్మకం పన్ను, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం ద్వారా తెలంగాణకు అంచనా ఆదాయంలో 42 శాతం 5 నెలల్లోనే వచ్చేసింది.