ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
దీనికి సంబంధించి మంత్రి కొడాలి నాని స్పందిస్తూ సాంకేతికంగా చాలా సమస్యలు వస్తున్నాయని అందుకే 3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ప్రకటన వస్తుందని నాని మీడియా ముందు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో తాము బయట మాట్లాడకూడదని పేర్ని నాని పేర్కొన్నారు. కాసేపట్లో దీనికి సంబంధించి మరో బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మూడు రాజధానులు రద్దు చేసేసం అని ఏజీ చెప్పారు.