‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు ఇప్పుడు తాజాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా,దీక్షిత్ శెట్టి , వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఒకే పోస్టర్లో ఉన్న ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అవుతుంది.