బ్రేకింగ్: ఇక నుంచి నో హారన్ జోన్ గా తిరుమల

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి గానూ నో హారన్ జోన్ గా ప్రకటిస్తున్నామని తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు ఈ నిబంధనను స్వచ్చందంగా పాటించాలి అని ఆయన సూచించారు. తిరుమలను నో హారన్ జోన్ గా ప్రకటించామని భవిష్యత్తు లో తిరుపతి ని కూడా ప్రకటిస్తామని అన్నారు. 

 

ఇక నుంచి తిరుమలలో గోవింద నామస్మరణ ఒకటే వినిపించాలి అని ఆయన స్పష్టం చేసారు. పోలీసు వాహనాలు కూడా ఇక నుంచి హారన్ మోగించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు అందరూ కూడా అర్ధం చేసుకోవాలి అని దీనికి సహకరించాలి అని సూచించారు. శబ్ద కాలుష్యం పెరిగిపోవడం మంచిది కాదన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: