యూఎస్ ఎయిర్లైన్స్.. కొత్త భద్రతా చర్యలు
కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. కరోనా వైరస్ కట్టడికి చాలా దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. సరిహద్దులను మూసివేశాయి. అయితే.. క్రమంగా సడలింపులు ఇస్తుండడంతో ప్రజారవాణా వ్యవస్థలు మెల్లమెల్లగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. అంతర్జాతీయ ప్రయాణాలపై నమ్మకాన్ని పెంచేందుకు యూఎస్ ఎయిర్లైన్స్ సంస్థలు సరికొత్త భద్రతా చర్యలను ప్రకటించాయి.
కరోనా వైరస్ సోకకుండా తీసుకుంటున్న చర్యలను వివరించాయి. దీంతో నిశ్చింతగా విమానాల్లో ప్రయాణించవచ్చునని చెబుతున్నాయి. యూఎస్ క్యారియర్లు జెట్బ్లూ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ మేరకు ప్రయాణికుల కోసం తీసుకుంటున్న భద్రతా చర్యలను ప్రకటించాయి.
U.S. carriers JetBlue Airways and United airlines announced fresh safety measures aimed at restoring confidence in travel pic.twitter.com/qxQAgXtqDf — Reuters (@Reuters) May 21, 2020