తరగని అందంతో భర్తను ఫోటోగ్రాఫర్ ని చేసిన...బ్యూటిఫుల్ కుష్బూ !!
కలియుగ పాండవులు సినిమాతో తన గ్లామర్ సత్తా చాటిన నటి కుష్బూ. ఆమె నటన ప్రారంభించిన తొలినాళ్ళనుండి యువతను ఆకట్టుకుంది. ఈమె కోసం తమిళనాడు ప్రజలు గుడి కట్టించారంటే అర్థమౌతుంది ఈమెకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ...లాక్ డౌన్ సందర్భంగా ఈ అందాల నటి ఇంట్లోనే ఉంటోంది. అయితే తాజాగా కుష్బూ మాములుగా రెడీ అయ్యి తన భర్తకు ఆలా కనిపించింది అంతే తన భర్త సుందర్ సీ తన కెమెరా తో తన భార్య అందాలను వడిసి పట్టుకున్నాడు.
ఈ విషయాలను కుష్బూ తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసింది. ఆ సందర్భాన్ని కుష్బూ వివరిస్తూ ...నేను రెడీ అవ్వడానికి ఎటువంటి అకేషన్ కారణం కాదు ...ఎప్పుడైతే నా భర్త ఫోటో గ్రాఫర్ అవతారం ఎత్తాడో ...ఈ సీన్ కాస్త అకేషన్ గా మారిందని చెబుతోంది. నేను ఇలా అందంగా కనబడుతున్నాను ఆంటే ఆ క్రెడిట్ అంత నా భర్త దే అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కుష్బూ , సుందర్ సీ లకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందితా. కుష్బూ చిరంజీవికి అక్కగా స్టాలిన్ లో నటించింది. ఆతరువాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి సినిమాలో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం కుష్బూ 'ఓహ్ అంధ నాట్కళ్ ' , 'అన్నఅత్థే' సినిమాలతో బిజీ ఉంది.
No special occasion..just wanted to feel good.. but it becomes special when your better half turns the photographer.. pics courtesy #SundarC ❤❤❤ pic.twitter.com/lwKTnIDr1q — KhushbuSundar ❤️ (@khushsundar) May 16, 2020