రామమందిరంకి అంబాని ఎన్ని కోట్లు విరాళం ఇచ్చాడంటే?

Purushottham Vinay
రామమందిరంకి అంబాని ఎన్ని కోట్లు విరాళం ఇచ్చాడంటే?


అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యే కాదు యావత్ భారత దేశం అంతా కూడా రామ నామంతో భక్తిపారవశ్యంలో మునిగిపోయింది.శ్రీరాముని విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.ఈ చారిత్రాత్మక వేడుకకు అన్ని రంగాలకు చెందిన అనుభవజ్ఞులను ఆహ్వానించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.ఇక రామమందిరం ట్రస్టుకు ముఖేష్ అంబానీ ఇచ్చిన విరాళం తాజాగా వెలుగులోకి వచ్చింది.ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇంకా కుమార్తె ఇషా అంబానీ అలాగే పిల్లలు ఆకాష్ అంబానీ-అనంత్ అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్, కోడలు శ్లోక ఈ వేడుకకు హాజరవ్వడం జరిగింది. ఇక అంబానీ కుటుంబం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతతో విమానాశ్రయం నుంచి రామాలయానికి చేరుకున్నారు.


ఈసారి జై శ్రీరామ్.. అనే చారిత్రాత్మకమైన రోజుకి ఇంకా భారతీయ సంస్కృతికి నేను గర్విస్తున్నాను అని నీతా అంబానీ అన్నారు.ఇక ఎంతో పవిత్రమైన ఈ రామమందిరం ట్రస్టుకు ముఖేష్ అంబానీ ఏకంగా 2.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఈ క్షణాన్ని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ అంబానీ అన్నారు. అలాగే ఈ సందర్భంగా అంబానీ కుటుంబం ఆనందంగా ఎంతో ఉత్సాహంగా కనిపించింది.ఈ రోజు ఖచ్చితంగా మన చరిత్ర పుటల్లో లిఖించబడుతుందని ఆకాష్ అంబానీ అన్నారు.అలాగే ఈరోజు అత్యంత పవిత్రమైన రోజులని ఇషా అంబానీ అన్నారు.ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఇంకా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమక్షంలో గర్భగుడిలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: