టీవీ: అందుకే శరత్ బాబుతో పిల్లల్ని కనలేకపోయా.. నటి జయలలిత హాట్ కామెంట్స్..!!

Divya
తెలుగులో పలు సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో నటి జయలలిత కూడా ఒకరు.. దశాబ్ద కాలం నుంచి టాలీవుడ్ లోనే ఈమె కొనసాగుతోంది. ఎక్కువగా వ్యాం పు పాత్రలలో చేసిన ఈమె భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. అందరిలాగే తాను కూడా తెర వెనుక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని నటి జయలలిత ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. తనని ఒక డైరెక్టర్ ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు నెలలకే విడాకులు ఇచ్చేసారని తెలియజేస్తోంది.

అతని టార్చర్ భరించలేకనే విడిపోయానని అప్పటి నుంచి తాను సింగల్ గానే ఉన్నానని తెలిపింది.. తన కెరియర్ లో కష్టాల గురించి తెలియజేసే క్రమంలో జయలలిత పలు విషయాలను బయటపెట్టింది. దివంగత నటుడు శరత్ బాబును తాను చాలా ప్రేమించానని ఆయనతో కలిసి కొన్నేళ్లు ట్రావెల్ కూడా చేశా.. ఇద్దరం కలిసి అనేక యాత్రలకు కూడా వెళ్ళాము దీంతో జీవితాంతం లైఫ్ ని పంచుకోవాలనుకున్నాము కానీ ఆయన ఎక్కువ ఆసక్తి చూపలేదు.. మా పెళ్లి జరగకుండా కొంతమంది ఇండస్ట్రీలో అడ్డుకున్నారని.. ఆయనతో కలిసి పిల్లల్ని కణాలను కూడా ప్లాన్ చేసా.. ఈ విషయం ఆయనకు కూడా ఇష్టంగానే ఉండేదని తెలిపింది..

ఒకవేళ ఇద్దరము కలిసి బిడ్డను కనీ చనిపోతే బయట వాళ్ళు ఆస్తికోసం తన బిడ్డను వేధిస్తారని భయం శరత్ బాబు గారు లో ఉండేదని తెలిపింది.. అందుకే ఆగిపోయామని తెలిపింది..ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు వేయడం తనకు చాలా ఇబ్బంది తెచ్చిపెట్టిందని.. దీంతో చాలామంది తనను అనుభవించాలని ప్రయత్నం చేశారు కొన్నిసార్లు పారిపోయేదాన్ని మరికొన్నిసార్లు లొంగక తప్ప లేదంటూ తెలియజేసింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే రేపు సన్నీ వేషం వివరిస్తాను అంటూ గదిలోకి తీసుకువెళ్లి మరి నిజంగానే రేప్ చేసిన సంఘటనని తాను ఎదుర్కొన్నట్లుగా కూడా వెల్లడిస్తోంది జయలలిత. అయితే అలా నన్ను ఇబ్బంది పెట్టిన అతడు ఆరు నెలలకే చనిపోయాడు అంటూ వెల్లడిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: