టీమిండియా తరఫున.. ఎక్కువ ఐసీసీ టోర్నీలు ఆడిన ప్లేయర్లు వీళ్లే?
అయితే మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోఈసారి ఈ ఐసీసీ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేయబోయే ఆటగాళ్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ లో భారత ఆటగాళ్ల గత గణాంకాలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎక్కువ సార్లు ఐసిసి టోర్నీలో ఆడిన ఆటగాళ్లు ఎవరు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఆ వివరాలు చూసుకుంటే... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీలు కలుపుకొని ఇక ఇండియా తరఫున అత్యధికంగా ఐసీసీ టోర్నీల ఆడిన ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోని టాప్ లో ఉన్నాడు. ఏకంగా 14 సార్లు ఐసిసి టోర్నీలలో భాగమయ్యాడు ధోని ఇక ఇందులో ఆటగాడిగా మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా ఇలా వరల్డ్ కప్ లలో పాల్గొన్నాడు. అతని కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. అయితే ధోని మాత్రమే కాదు యువరాజ్ కూడా 14 సార్లు ఐసిసి టోర్నీలలో టీమిండియాలో భాగమయ్యాడు. ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ తో రోహిత్ కూడా అటు 14సార్లు ఐసిసి టోర్నీలలో టీమిండియా కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు. తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 13, సచిన్ 11, హర్భజన్ 11 తో తర్వాత స్థానాల్లో ఉన్నారు.