ఏంటీ.. రిటైర్మెంట్ తర్వాత.. బ్రిటన్ లో సెటిల్ అవుతాడా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ అంటే ఎవరో తెలియని క్రికెట్ ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో కేవలం ఇండియన్ క్రికెట్ లో మాత్రమే కాదు వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక నేటి తరంలో తనను మించిన లెజెండ్ మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ సాధించిన రికార్డులను అలవోకక బద్దలు కొట్టి అతను కూడా ఒక లెజెండ్ గా ఎదిగాడు అని చెప్పాలి. అయితే కేవలం క్రికెట్ విషయంలోనే కాదు సోషల్ మీడియాలో ఉండే పాపులారిటీ విషయంలోనూ కూడా కోహ్లీ సాటి క్రికెటర్లకు అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. కాబట్టి అతని గురించి ఏ విషయం వెలుగులోకి వచ్చిన.. అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో విరాట్ కోహ్లీ గురించి ఒక కొత్త వార్త తెరమీదకి వచ్చి అభిమానులు అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇండియాలో ఉండబోడని.. బ్రిటన్ వెళ్లి అక్కడే సెటిల్ కావడానికి రెడీ అవుతున్నాడు అంటూ సారాంశమున్న ఒక వార్త వైరల్ గా మారిపోయింది. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే.. ఇది నిజమే అని అభిమానులకు కూడా అనిపిస్తుంది అని చెప్పాలి.

 ఎందుకంటే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఇక ఎన్నో రోజుల నుంచి అటు బ్రిటన్ లోనే ఉంటున్నారు. అదే సమయంలో ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు పుట్టిన రెండో బిడ్డ ఆకాయ్ కూడా బ్రిటన్ లోనే జన్మనిచ్చారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పిల్లల ప్రైవసీ కోసం విరూష్క జంట బ్రిటన్ లోనే సెటిల్ కావాలని అనుకుంటున్నారు అన్నది తెలుస్తోంది. అయితే బ్రిటన్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కారణంగా అక్కడ పౌరసత్వం పొందాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉంటేనే విరాట్ కోహ్లీ అటు ఇండియా వస్తాడని..  లేదంటే పూర్తిగా బ్రిటన్ కే పరిమితం అయిపోతాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: