ఇన్నేళ్ల చరిత్రలో.. ఇంగ్లాండ్ తో మ్యాచ్లో ఇలా జరగటం ఇదే తొలిసారి?
ఇక ధర్మశాల వేదికగా ఒక రకంగా టీమిండియా పైచేయిగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే భారత ఆటగాళ్లు అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యం గా భారత బ్యాట్స్మెన్లు సెంచరీలతో చెలరేగి పోతున్నారు అని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఇప్పటికే సెంచరీలు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఇలా అద్భుతమైన ఆట తీరుతో భారత ఆటగాళ్ళు ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఈ క్రమం లోనె ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డు నమోదయింది. ఇంగ్లాండ్ ఫై టీమిండియా టాప్ ఫైవ్ బాట్స్మన్లు అర్థ సెంచరీలు సాధించడం చరిత్ర లో ఇదే తొలి సారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 105, గిల్ 110, యశస్వి జైష్వాల్ 57, సర్పరాజు 56, పడిక్కాల్ 62 పరుగులు చేశారు. ఇలా టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఇంగ్లాండు తో భారత జట్టు ఎన్నోసార్లు టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఇలాంటి రికార్డు మాత్రం ఎప్పుడూ నమోదు కాలేదు అని చెప్పాలి.