టీమిండియాకు గుడ్ న్యూస్.. చితక్కొట్టే ప్లేయర్ వచ్చేస్తున్నాడు?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఈ ఏడాది ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ఫార్మాట్లో ఉండే ధనా ధన్ ఇన్నింగ్స్ లు చూసి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందాలని భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కాగా జూన్ నెలలో ఈ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో చెత్త ప్రదర్శనలతో నిరాశపరిచిన భారత జట్టు ఇక ఇప్పుడు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగబోయే టి20 వరల్డ్ కప్ ను మాత్రం తప్పనిసరిగా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

 ఈ క్రమంలోనే పక్క ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు టి20 ఫార్మాట్లో మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఒక విధ్వంసకరమైన ప్లేయర్. అతను ఎవరో కాదు.. నయా మిస్టర్ 360 ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్న సూర్య కుమార్ యాదవ్. అతను క్రీజులో నిలదొక్కుని ఆడుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు.. అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు ఈ ప్లేయర్. మైదానం నలువైపులా సూర్య కుమార్ యాదవ్ కొట్టే షాట్ల గురుంచి అబ్బో మాటల్లో వర్ణించడం కూడా కష్టమేమో అని అనిపిస్తూ ఉంటుంది.

 గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సమయంలో గాయం బారిన పడిన సూర్య కుమార్ యాదవ్ ఇక టి20 వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయంపై సందీగ్దత నెలకొంది. అయితే ఈ విషయంపై టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అని చెప్పాలి. దీంతో జూన్ రెండవ తేదీ నుంచి జరగబోయే టి20 వరల్డ్ కప్ టోర్నిలో సూర్య కుమార్ యాదవ్ భారత జట్టు విజయాలను కీలకపాత్ర వహిస్తాడని అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: