సౌత్ ఆఫ్రికా తరఫున ఆడిన.. ఇండియన్ క్రికెటర్.. ఎవరో తెలుసా?
అందుకే ఇప్పటివరకు ఎంతోమంది విదేశీ ప్లేయర్ల లాగా ఇండియన్ ప్లేయర్లు ఇండియాకు కాకుండా మరో దేశానికి ఆడిన దాఖలాలు కూడా లేవు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక క్రికెటర్ మాత్రం ఏకంగా ఇండియాకు మాత్రమే కాదు సౌత్ ఆఫ్రికా తరఫున కూడా ఆడాడు. ఈ క్రమంలోనే అతని పేరు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . అయితే అతను ఆడింది ఇప్పుడు కాదు ఏకంగా 2015లో ఒక యంగ్ క్రికెటర్.. ఇలా ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున కూడా ఆడాడు అన్న విషయం కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి ఇండియన్ క్రికెటర్ వేరే దేశానికి ఆడటమేంటి అని.. బీసీసీఐ రూల్స్ ప్రకారం అది సాధ్యం కాదు కదా అనుకుంటున్నారు కదా.
కానీ ఒకసారి మాత్రం ఇది సాధ్యమైంది. 2017లో టీమిండియాతో సౌత్ ఆఫ్రికా ఏ జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకు చెందిన నలుగురు ప్లేయర్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం మేనేజ్మెంట్ ఒక ప్లేయర్ కావాలని టీమ్ ఇండియాను రిక్వెస్ట్ చేసింది. దీంతో టీమిండియా జట్టుకు 12వ ప్లేయర్ గా ఉన్న మన్ దీప్ సింగ్ సౌత్ ఆఫ్రికా జెర్సీ ధరించి ఆ జట్టు తరఫున ఆడాడు. కాగా ఈ ఆటగాడు గతంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలుస్తుంది. ఇలా ఇండియన్ క్రికెటర్ అయ్యుండి రెండు దేశాల తరఫున ఆడిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు ఈ యువ ఆటగాడు.