సంజు క్రికెట్ మానేసి.. ఫుడ్ బాలర్ అవుతాడా ఏంటి.. వీడియో వైరల్?

praveen
భారత క్రికెటర్ సంజు శాంసన్ ఎంతో మంది యువ ఆటగాళ్ళతో పోల్చి చూస్తే కాస్త ముందుగానే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టినప్పటికీ.. తన ప్రతిభను నిరూపించుకోలేక అందరికంటే వెనుకబడిపోయాడు. ఈ క్రమంలోనే అడపాదడపు అవకాశాలు మాత్రమే అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఇక టీమిండియాలో దక్కిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని.. ఏకంగా సెంచరీ తో చలరేగిపోయాడు. ఇక ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ సిరీస్ అడుగుతుండడంతో ఇక సంజు శాంసన్ విరామంలో ఉన్నాడు.

 అయితే ఈ విరామంలో ఏకంగా ఫుట్బాలర్ అవతారం ఎత్తాడు సంజూ. ఇక క్రికెట్ ఆటగాళ్లు సరదాగా ఎప్పుడు ఫుట్బాల్ ఆడుతూనే ఉంటారు. సంజు కూడా అలాగే ఆడాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతను ఫుట్బాల్ ని కూడా సీరియస్గా తీసుకున్నాడు. ఏకంగా ఒక టోర్నీలో ఓ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసి సంజు ఫ్యాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అతని ఫుట్బాల్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడిలో ఉండాల్సిన నైపుణ్యాలు అన్నీ కూడా అతనిలో ఉన్నాయి అని చెప్పాలి.

 అతని సొంత రాష్ట్రం అయినా కేరళలోని సెవెత్స్ టోర్నీలో ఒక స్థానిక జట్టు తరఫున సంజు శాంసన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. సంజు మిడ్ ఫీల్డ్ నుండి బంతిని అతని పాదాల వద్దకు ఉంచుకొని పరిగెత్తాడాన్ని.. వీడియోలో చూడవచ్చు. అయితే భారత క్రికెటర్లు ఫుట్బాల్ ఆడటం కొత్త కాదు. సన్నాహాక సెషన్ లో భాగంగా ఫుట్బాల్ ఆడటానికి చూస్తూనే ఉంటాం. అయితే ఇలా ఒక ఫుట్బాల్ టోర్నమెంట్లో చురుకుగా పాల్గొనడం మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. అయితే సంజుకి క్రికెట్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. కాబట్టి ఇక ఫుట్బాల్ ఆటలోకి అరంగేట్రం చేయాలని అనుకుంటున్నాడా ఏంటి అని ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో మందిని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: