కెప్టెన్ జవాబుదారీగా ఉంటేనే.. బెటర్ రిజల్ట్స్ వస్తాయి : గవాస్కర్

praveen
క్రికెట్లో ఆటగాళ్లపై ఎప్పుడు వేటు పడుతుంది అన్నది కూడా ముందుగా ఊహించడం చాలా కష్టం. ఏదైనా క్రికెట్ మ్యాచ్ లో జట్టు ఘోర వైఫల్యాన్ని చవిచూసింది అంటే చాలు.. ఇక ఆ తర్వాత జట్టు ప్రక్షాళన పై సెలక్షన్ కమిటీ దృష్టి పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అంతకుముందు జరిగిన మ్యాచ్లలో ఎవరు పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచారు  అన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటుంది.

 ఈ క్రమంలోనే పేలువ ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై వేటు వేస్తూ ఇక ఆ తర్వాత సిరీస్ లకు పక్కన పెట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది సెలెక్షన్ కమిటీ. అయితే ఇలా ప్లేయర్ల ప్రదర్శన ఆధారంగా వారికి జట్టులో చోటు కల్పించాలా వద్ద అని నిర్ణయించుకుంటారు. కానీ కెప్టెన్ గా ఉన్న ఆటగాడి విషయంలో మాత్రం సెలెక్టర్లు పెద్దగా ఇలాంటివి పట్టించుకోరు. కెప్టెన్ గా ఉన్న ప్లేయర్ వరుసగా వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ జట్టుకు భారంగా మారిపోయినప్పటికీ అతనికి మాత్రం వరుసగా జట్టులో స్థానం కల్పిస్తూనే ఉంటారు అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఇటీవల సునీల్ గవాస్కర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 జట్టు చిత్తుగా ఓడిపోయినప్పటికీ తన స్థానానికి డోకా లేదు అని భరోసా ఉన్నప్పుడు.. కెప్టెన్లు అన్నిటిని తేలికగా తీసుకునే అవకాశం ఉంది సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2011 నుంచి ఇలా జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో 0-4 తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ కెప్టెన్ గా ఉన్న ధోనిని మార్చలేదు. అయితే కోచ్, కెప్టెన్ ఓటములకు జవాబుదారీగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ లెజెండరి ప్లేయర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: