తిరుమల వచ్చే భక్తుల‌కు ఈ సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రి..!

VUYYURU SUBHASH

క‌రోనా నేప‌థ్యంలో కొద్ది రోజుల పాటు మూత‌ప‌డిన ప‌విత్ర‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొన్ని ప్ర‌త్యేక ప‌రిమితుల‌తో మ‌ళ్లీ ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే. భ‌క్తులు ఇప్పుడు స్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. ఇప్పుడు తిరుమ‌ల వెళ్లే భ‌క్తులు కొన్ని సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన అవ‌స‌రం ఉంది.... లేనిప‌క్షంలో భ‌క్తుల‌కు ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.. ఈ సూచ‌న‌లు ఇలా ఉన్నాయి.

 

- ఆన్‌లైన్‌లో 300 రూపాయల దర్శనం టికెట్ వేయించుకున్నవారు CRO ఆఫీస్ కి వెళితే అక్కడ 100 రూపాయల రూమ్స్ వరహస్వామి విశ్రాంతి భవనం నందు రూమ్ కి ఇద్దరి చొప్పున వెంటనే రూమ్స్ ఇస్తున్నారు.

- తిరుమ‌ల‌లో ఎక్కడ టిఫిన్ హోటల్స్ లేవు వాటర్ బాటిల్స్ అమ్మడం లేదు కావున తిరుమల వచ్చే వారు. ఇంట్లో బాటిల్ తెచ్చుకుంటే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫిల్ చేసుకోవచ్చు.

- ఒక్క వరహస్వామి విశ్రాంతి భవనం పక్కన ఒక్క  టిఫిన్ హోటల్  మెడికల్ షాప్ మాత్రమే ఉంది.

 

- వెంగమాంబ లో టేబుల్ కి ఇద్దరిని మాత్రమే కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నారు.

- లడ్డు ప్రసాదం ఒకటి 50 రూపాయలు చొప్పున ఎవరికి  ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు

- దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతోంది. ఎక్కడ ఎవరికి తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ నిదానంగా పంపిస్తున్నారు. క్యూలో ఉంటే ఒక 45 నిమిషాలలో దర్శనం అవుతుంది.

 

- అలానే  తలనీలాలు మూడు కత్తెర్లు ఇచ్చే వాళ్ళు.. నందకం గెస్ట్ హౌస్ కింద అండర్ గ్రౌండ్ లో ఎటువంటి రుసుము లేకుండా పలు జాగ్రత్తలు పాటిస్తూ చేతికి గ్లోవ్‌స్ వేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.

-  స్వామి వారిని మన జన్మ లో ఇటువంటి  ప్ర‌శాంత‌మైన దర్శనం చేసుకోలేము.. ఇంత ప్రశాంతమైన తిరుమల ఎప్పుడు చూడలేమ‌ని భ‌క్తులు చెప‌తున్నారు.

- వరాహ స్వామి టెంపుల్ రిపేర్ చేయిస్తున్నారు.. కావున వరహస్వామి టెంపుల్ క్లోజ్ చేశారు.

 

ఏడు కొండల వాడా వెంకట రమణ గోవింద గోవిందా ...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: