పాకిస్తాన్ లో సంచలనం సృష్టిస్తున్న పవన్ కల్యాణ్ కామెంట్స్ !

Chakravarthi Kalyan

ఔను.. మీరు చదువుతున్నది నిజమే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు పాకిస్తాన్ లో హాట్ టాపిక్ అయ్యారు. భారత్ తో జరుగుతున్న యుద్ధం తరహా పరిస్థితిలో తమ పాత్రను సమర్థించుకోవడానికి పాకిస్తాన్ కు మన పవన్ కల్యాణ్ ఉపయోగపడుతున్నారు. ఆయన ఇటీవల చేసిన కామెంట్లను అక్కడి మీడియా ఇప్పుడు ప్రముఖంగా కోట్ చేస్తోంది.



ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమన్నారు.. అసలేం జరిగింది. ఓసారి చూద్దాం.. పాకిస్థాన్ తో యుద్ధం రాబోతోందని కొందరు బీజేపీ నేతలు తనతో చెప్పినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలుగు మీడియా నుంచి నేషనల్ రేంజ్ వరకూ వెళ్లింది. ఇక ఇలాంటి వార్త తెలిస్తే పాక్ మీడియా ఊరుకుంటుందా..



పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ వెబ్ సైట్ పవన్ కల్యాణ్ మాటలను యథాతథంగా ప్రచురించింది. భారత్ కు చెందిన ఓ ఇంగ్లీష్ పేపర్ స్టోరీ లింకును దీనికి జతచేసింది. ఆ వార్త ప్రకారం.. యుద్ధం వస్తుందని బీజేపీ నాయకులు నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.



ఇటీవల మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లు కూడా పాక్ అనుకూల వాదులకు అస్త్రంగా మారుతున్నాయి. అందుకే విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి నాయకుల వల్ల మన సైన్యం మానసిక స్థైర్యం దెబ్బతింటుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: