ఏపీలో రెడీ అయిపోయిన హైకోర్టు..!
పోలీసుల గౌరవ వందనాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ జడ్జీలు మొత్తం బెజవాడలో ఉన్న దుర్గ గురించి సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏపీ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మంగళవారం చక్క పెడతా కి రెడీ అయింది.
ఏపీకి అలాట్ చేసిన జడ్జిలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏపీకి వచ్చారు. నోవాటెల్ హోటల్లో జడ్జి కుటుంబసభ్యులకు బస ఏర్పాటు చేశారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో హైకోర్టు తాత్కాలిక భవనం కొనసాగనుంది. ప్రస్తుతం హైకోర్టు కి భవనం లేనందున సిటీ సివిల్ కోర్టు లో హైకోర్టు తన కార్యకలాపాలు చేయనున్నట్లు సమాచారం.